Priyanka Gandhi counters PM Modi, cites 3 reasons why govt wanted Vande Mataram debate: What are they?
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ మరియు బీజేపీ తరచూ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని, నెహ్రూ చేసిన త్యాగాలను గుర్తు చేశారు.
ప్రియాంక మాట్లాడుతూ—ప్రధాని మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో, దాదాపు అంతే సంవత్సరాలు నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం జైలులో గడిపారని అన్నారు. నెహ్రూను విమర్శించే ప్రతి సందర్భాన్నీ లెక్క పెట్టి ఒక జాబితా తయారు చేసుకోవాలంటూ వ్యంగ్యంగా సూచించారు.
“999 సార్లు అయినా, 9,999 సార్లు అయినా—ఒక లిస్ట్ చేసుకోండి. మనం వందేమాతరం కోసం 10 గంటల చర్చ చేసినట్లే, దీనిపై కూడా మీరు కోరినంత సేపు డిబేట్కు మేము సిద్ధం,” అని ప్రియాంక అన్నారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వారసత్వ రాజకీయాలు, నెహ్రూపై ఉన్న ఆరోపణలు—ఏ విషయం అయినా ప్రజల ముందే తెరవెయ్యాలని, ఒకసారి చర్చించి ముగింపు పలుకుదామని ఆమె స్పష్టం చేశారు.
Brilliant speech by Priyanka Gandhi Ji in the Parliament. Sharing an excerpt:
— Shantanu (@shaandelhite) December 8, 2025
“You don’t want to listen Netaji Subhash Chandra Bose’s words..”
“Narendra Modi is PM for 12 years, Nehru Ji was in jail for 9 years..”
“Nehru Ji built IITs, IIMs, ISRO, AIIMS…” pic.twitter.com/HaDZWWNS1V